Chinna Jeeyar Swamy Controversy Statement on Adi Shankaracharya శ్రీ చిన్న జీయర్ స్వామి గారు తాను భక్తులకు ఇస్తున్న ఒక ప్రచనంలో శ్రీ ఆదిశంకరాచార్యుల వారి పేరును ఉటంకిస్తూ చాతురామ్నాయ పీఠాలు స్థాపించింది ఆయన కాదని కొంచెం వ్యంగ్య స్వరం తో చెబుతూ ఆ పీఠాలను స్థాపించింది విజయనగర సామ్రాజ్య స్థాపకులైన హరిహర బుక్కరాయల గురువు, శృంగేరి పీఠాధిపతి శ్రీ విద్యారణ్య స్వామి వారని పేర్కొనడం జరిగింది. చారిత్రాత్మకంగా ఆ పీఠాలను స్థాపించింది శంకరాచార్యుల వారని జగద్విదితం. వీరు చరిత్రను చింపేస్తున్నారో తిరగరాస్తున్నారో తెలియదు గానీ సనాతన ధర్మాన్ని గౌరవిస్తూ, విశ్లేషిస్తూ అనుసరిస్తున్న వారికి ఈ మాటలు ఆమోదనీయం కాదు. పైగా వారు మరొక రెండు నిందలు వేశారు. మొదటిది శంకరాచార్యుల వారు విష్ణువుని కీర్తించాడని, విష్ణు సహస్రనామం, భగవద్గీతలకు భాష్యాలు వ్రాసాడు కనుక ఆయన శుద్ధ వైష్ణవుడు అని అనడం. రెండవది ఆయనకు పంచాయతనం తెలియదని. పంచాయతనాన్ని ప్రతిపాదించింది కూడా శ్రీ విద్యారణ్య స్వామి వారేనని. మొదటి నిందకు సమాధానం: ఒక శివారధకుడు విష్ణువుని కీర్తించినంత మాత్రాన వైష్ణవుడు అవుతాడా? మరి రామాయణం లో రాముడు శివ లింగాన్ని ప్...