పోస్ట్‌లు

Telugu Stories లేబుల్ గల పోస్ట్‌లను చూపుతోంది

జీవితమే ఒక ప్రవచనం

చిత్రం
  సూరిబాబు పనిమీద ఒక రోజు పట్నం వెళ్ళాడు. పట్నంలో దసరా నవరాత్రి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. రోజూ సాయంత్రం వేళ దగ్గరలో ఉన్న అమ్మవారి ఆలయం వద్దకు వెళ్లి దర్శనం చేసుకుని, అక్కడ జరిగే వేడుకలు చూసి, రాత్రి తన రూముకి తిరిగి వెళ్ళేవాడు. చివరి రోజున ఒక ప్రవచన కార్యక్రమం జరుగుతుంటే పోయి కూర్చుని వింటున్నాడు. ఆ ప్రవచన కారుడు ఇలా చెబుతున్నాడు...‌ దేవేంద్రుడు, దేవతలు బండాసుర రాక్షసుల బలానికి తట్టుకోలేక అమరావతిని విడిచిపెట్టి పారిపోయారు. దేవేంద్రుడు ఢీలా పడిపోయి కూర్చున్నాడు. అప్పుడు అతని భార్య అతనికి ధైర్యం చెప్పి, అమ్మవారి శరణు కోరమంది. సరే అని దేవతలతో సహా దేవేంద్రుడు అమ్మవారి కోసం ప్రార్థనలు చేసాడు.  అప్పుడు అమ్మవారు కనికరించి కామేశ్వరీ దేవతగా వచ్చి భండాసురుని అంతం చేసింది. కనుక ఎప్పుడూ నీకు కష్టాలు వస్తే కుమిలిపోతూ కూర్చోకు. అలా కుమిలిపోతూ కూర్చుంటే ఫలితం ఉండదు. ధైర్యంగా ఎదుర్కోవాలి అంటూ చెబుతూ... కష్టాలు అంటే ఏమిటి కల! అసలు ఈ లోకమే ఒక కల. మనం పుట్టడం ఒక కల‌. పెరగడం ఒక కల. సంసార జీవితం ఒక కల. పగలు కల. రాత్రి కల. రాత్రి నిద్రలో కలగనడం ఒక కల. మళ్ళీ మేల్కోవడం ఒక కల. బాధ్యతలూ, బరువులు మోయ...

బ్రతుకు తెరువు

చిత్రం
సూర్యంపేట గ్రామంలో బ్రహ్మం అనే ఒక వడ్రంగి కుటుంబం నివసిస్తూ ఉండేది. ఆ గ్రామంలో అతనికి నిత్యం చేతినిండా పని ఉండేది. నాగలి కొయ్య, ఎడ్లబండి, బండి చక్రాలు, ఇళ్ళ తలుపులు, ద్వారబంధాలు, ఒకటేమిటి... చెక్కపనికి సంబంధించిన పనులన్నీ బ్రహ్మం కుటుంబమే చేసేది.  గ్రామస్తులంతా బ్రహ్మం కుటుంబాన్ని చాలా ఆదరించేవారు. ఎందుకంటే కులవృత్తిని నమ్ముకున్న ఆ కుటుంబం ధనానికి వెంపర్లాడకుండా ఊరి అవసరం కోసం పనిచేసేది. ఊరి వాళ్ళు కూడా బ్రహ్మం కూటుంబానికి ఏలోటూ లేకుండా చూసుకునేవారు.  కానీ కాలం మారిపోయింది... బ్రహ్మం ముసలి వాడయ్యాడు. ఓపిక తగ్గిపోయింది. అతని కొడుకులు మాత్రం అదే వృత్తిలో పని చేస్తున్నారు... ఇప్పుడు ఊరు కూడా ఇదివరకటిలా లేదు. చాలా మారిపోయింది. ఊరి జనం కూడా మారిపోయారు. మునుపటి మంచితనం, సహకారం ఇప్పుడు వారిలో కనిపించడం లేదు.  ఎందుకంటే... ఎడ్లబళ్ళ అవసరం తగ్గిపోయింది. ట్రాక్టర్ల వాడకం పెరిగింది. నాగలి అవసరం లేకుండానే పొలం దున్నే వ్యవస్థ వచ్చేసింది. ఇళ్ళకు వాసాలు కమ్మీలు అవరం తగ్గిపోయింది. కిటికీలు, ద్వారబందాలు, తలుపులు తప్ప మిగతాదంతా సిమెంటు, కాంక్రీటు పనే. పైగా రెడీ మేడ్ తలుపులకు, ఫర్నీచర్ కు గ్...

దాపరికం

చిత్రం
వాసంతి వసంత్ ఇద్దరూ కాకినాడ లో ఇంజనీరింగ్ చదువుకున్నారు. ఇద్దరూ ఒకరినొకరు ప్రేమించుకున్నారు. వాసంతి మంచి అందగత్తె, వసంత్ కూడా అందగాడు... ఉంగరాల జుట్టు వాడు. కానీ చదువు పూర్తి అయ్యాక వాసంతికి హైదరాబాద్లో ఉద్యాగం వచ్చింది, వసంత్ కి బెంగళూరు లో జాబ్ వచ్చింది. ఐదేళ్ళు గడిచిపోయాయి... ఎప్పుడూ వాట్సాప్ చాట్ చేసుకోవడమే గానీ ముఖాముఖాలు చూసుకోలేదు. కనీసం వీడియో కాల్ కూడా చేసుకోలేదు. ఇంతలో వాసంతికి వాళ్ళ ఇంట్లో పెళ్లి చేసుకోమని తొందర పెట్టడం స్టార్ట్ చేసారు. వాసంతికి టెన్షన్ పట్టుకుంది. తమ ప్రేమ విషయాన్ని వాళ్ళ పేరెంట్స్ కి చెప్పింది. వసంత్ తో మాట్లాడి ఎప్పుడు వచ్చేదీ కన్ఫర్మ్ చేయమని చెప్పారు వాసంతి పేరెంట్స్. ఏంటి వాసంత్ ఐదేళ్ళు దాటిపోయాయి. నిన్ను చూసి ఇదుగో వస్తానంటావు గాని హైదరాబాద్ రావు, కనిపించవు. అసలు నీ ఉద్దేశ్యం ఏంటి? నన్ను పెళ్లి చేసుకుంటావా? వేరే వెతుక్కుంటూ ఉన్నావా? తొందరగా మన విషయం మా వాళ్ళకి చెప్పాలి. అంది వాసంతి  నేను మీ పేరెంట్స్ కి వచ్చి చెప్తాను గానీ... నాకు భయంగా ఉంది వాసంతి. వాళ్ళు ఒప్పుకుంటారో లేదో. అని జంకుతూ అన్నాడు వసంత్ ఏం ఎందుకు ఒప్పుకోరు అనుకుంటున్నావ్. నేను ఇష్టాన్...

మంచి దొంగ

చిత్రం
బుచ్చిబాబు నీర్సంగా వాళ్ళ మామయ్య ఇంటికి వచ్చాడు. అతడి వాలకం చూడగానే వాళ్ళు మావయ్యకి అర్థమైపోయింది. రావోయి అల్లుడూ ఏంటి నీర్సంగా మొహం పెట్టావ్ మళ్ళీ గొడవలా? అన్నాడు వాళ్ళ మామయ్య జగన్నాథం  ఏం చెప్తాం మావయ్యా... ఈ బాధలు భరించలేక పోతున్నామనుకో... అన్నాడు బుచ్చిబాబు. నేను పడే బాధల్తో పోలిస్తే నీవి కూడా ఒక బాధలేనట్రా... పెళ్ళాలు అలాగే అంటార్రా మనం ఈ చెవితో విని ఆ చెవితో వదిలేయాలి. అన్నీ ఎక్కడ పట్టించుకుని కూర్చుంటాం. అన్నాడు జగన్నాథం. ఎలా వదిలెస్తాం మావయ్యా రోజూ మాటలతో హింసిస్తుంటే... అన్నాడు బుచ్చిబాబు. అరేయ్... నేను పడ్డ హింసలతో పోలిస్తే నువ్వు పడుతున్నవి కూడా హింసలేనట్రా... నా ప్లేసులో మరొకడుంటే... ఉంటే... అత్తయ్యని చంపేసేవాడా...? కాదురా వాడే భరించలేక చచ్చేవాడు. సహనమే పురుషుడికి అలంకారం తెలుసుకో. సిగ్గే స్త్రీలకి సింగారం అనే మాట విన్నాను గానీ... సహనమే పురుషుడికి అలంకారం అని కొత్తగా నీ నోటినుండే వింటున్నాను. ఆ అలంకారం నాకొద్దులే మావయ్యా... అన్నాడు బుచ్చిబాబు. ఇంతకీ ఈ గొడవకి కారణం ఏమిటంటే... బుచ్చిబాబు కూరలకి వెళ్ళి, డబ్బులిచ్చి వంకాయలు, బెండకాయలు సంచిలో వేసుకోవడం మరచిపోయి అక్కడే వద...

ఘరానా దొంగలు

చిత్రం
సీతయ్య అనే ఒక బట్టల వ్యాపారి వ్యాపార నిమిత్తం పట్నం వెళ్లి బ్యాంకులో రెండు లక్షలు డ్రా చేసాడు.  తిరిగి వస్తుండగా ఒక నిర్మానుష్య ప్రదేశంలో అతడికి జ్యువెలరీ బాక్స్ రోడ్డు మీద కనిపించింది. దానిని తీసి ఓపెన్ చేసి చూసాడు.  అందులో ఖరీదైన వాజ్రాల హారం కనిపించింది. వెంటనే దానిని తన బట్టల సంచిలో బట్టల మధ్య దాచేసుకుని, ఏమీ తెలియని వాడిలా వెళ్ళిపోతున్నాడు.. నాలుగడుగులు వేసి మలుపు తిరిగే లోపు ఒక ధనవంతుడైన వ్యక్తి ఎదురుపడ్డాడు.  ఈ దారిలో నా జెవెలరీ బాక్సు జారీ పడింది. నీకేమైనా కనిపించిందా అని అడిగాడు.  దురాశపరుడైన బట్టల వ్యాపారి, అబ్బే నాకేమీ కనిపించలేదే అన్నాడు.  కానీ ఆ వ్యక్తి. ఈ దారిలో నువ్వు తప్ప ఇప్పటివరకూ ఎవ్వరూ రాలేదు... నీ చేతిలో ఏమిటా సంచి? ఏముంది అందులో అన్నాడు.  నేను ఊరినుండి వస్తున్నాను. సంచిలో నా బట్టలు ఉన్నాయి... నేను బట్టల వ్యాపారిని అన్నాడు.  నాకు నీమీద అనుమానంగా ఉంది చూపించు అన్నాడు.  నా సంచి నీకెందుకు చూపించాలి నేను చూపించను నన్ను వెళ్ళనీ అంటూ తప్పించుకోబోయాడు బట్టల వ్యాపారి.  మర్యాదగా ఆగు. నీ సంచి తనిఖీ చేయాలి అన్నాడు ఆ వ్యక్తి. ఇంతల...