బ్రతుకు తెరువు
సూర్యంపేట గ్రామంలో బ్రహ్మం అనే ఒక వడ్రంగి కుటుంబం నివసిస్తూ ఉండేది. ఆ గ్రామంలో అతనికి నిత్యం చేతినిండా పని ఉండేది. నాగలి కొయ్య, ఎడ్లబండి, బండి చక్రాలు, ఇళ్ళ తలుపులు, ద్వారబంధాలు, ఒకటేమిటి... చెక్కపనికి సంబంధించిన పనులన్నీ బ్రహ్మం కుటుంబమే చేసేది. గ్రామస్తులంతా బ్రహ్మం కుటుంబాన్ని చాలా ఆదరించేవారు. ఎందుకంటే కులవృత్తిని నమ్ముకున్న ఆ కుటుంబం ధనానికి వెంపర్లాడకుండా ఊరి అవసరం కోసం పనిచేసేది. ఊరి వాళ్ళు కూడా బ్రహ్మం కూటుంబానికి ఏలోటూ లేకుండా చూసుకునేవారు. కానీ కాలం మారిపోయింది... బ్రహ్మం ముసలి వాడయ్యాడు. ఓపిక తగ్గిపోయింది. అతని కొడుకులు మాత్రం అదే వృత్తిలో పని చేస్తున్నారు... ఇప్పుడు ఊరు కూడా ఇదివరకటిలా లేదు. చాలా మారిపోయింది. ఊరి జనం కూడా మారిపోయారు. మునుపటి మంచితనం, సహకారం ఇప్పుడు వారిలో కనిపించడం లేదు. ఎందుకంటే... ఎడ్లబళ్ళ అవసరం తగ్గిపోయింది. ట్రాక్టర్ల వాడకం పెరిగింది. నాగలి అవసరం లేకుండానే పొలం దున్నే వ్యవస్థ వచ్చేసింది. ఇళ్ళకు వాసాలు కమ్మీలు అవరం తగ్గిపోయింది. కిటికీలు, ద్వారబందాలు, తలుపులు తప్ప మిగతాదంతా సిమెంటు, కాంక్రీటు పనే. పైగా రెడీ మేడ్ తలుపులకు, ఫర్...